హైదరాబాద్ : ఈ నెల 29న 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయిన మార్గాల్లో అదనంగా ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది.
కేశవగిరి నుంచి బోరబండ(9YF) వరకు 22 బస్సులు, సికింద్రాబాద్ నుంచి హైటెక్సిటీ(10H)కి 54 బస్సులు, సికింద్రాబాద్ – బోరబండ(10YF) వరకు 16, సీబీఎస్ చాంద్రాయణగుట్ట నుంచి పటాన్ చెరు(218) వరకు 108, సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరుకు (219) వరకు 84 బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు సూచించారు.