సిటీబ్యూరో, అక్టోబరు 10(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై గగన్పహాడ్ వద్ద నిర్మిస్తున్న భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో భాగంగా ఎవలాన్ అన్మోల్ టవర్కు భూమి పూజ ఆదివారం నిర్వహించారు. శంషాబాద్ సమీపంలో ఉండే గగన్పహాడ్లో 3.5 ఎకరాల విస్తీర్ణంలో 3 టవర్లను జీ ప్లస్ 14 అంతస్థుల్లో నిర్మిస్తున్నారు. ఇందులో సుమారు 400లకు పైగా ఫ్లాట్లు ఉంటాయని అన్మోల్ గ్రూపు కంపెనీ డైరెక్టర్ మహ్మద్ సలీం తెలిపారు. ఈ ప్రాజెక్టును గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, అత్యాధునిక ప్రణాళికతో, ఫ్లాట్కు ఫ్లాట్కు మధ్య కామన్ వాల్ లేకుండా వాస్తుకు అనుకూలంగా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రత్యేకంగా లాంజ్, హెల్త్ క్లబ్, ఇండోర్ గేమ్ ఏరినా, 3.5 వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్ వంటివి ప్రధానంగా ఉంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రత్యేకంగా హాజరై నిర్మాణదారులను అభినందించారు. కార్యక్రమంలో అన్మోల్ గ్రూపు ప్రతినిధులు సయ్యద్ అనీసుద్దీన్, రఫీక్ ఖిమానీ, మహ్మద్ సల్మాన్, మహ్మద్ ఆదిలుద్దీన్లు పాల్గొన్నారు.