అమీర్పేట్, ఏప్రిల్ 3 : మద్యం మత్తులో తోటి స్నేహితుడిని సెంట్రింగ్ కర్రతో కొట్టడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్యామ్సుందర్రావు(56) కూకట్పల్లి ప్రశాంతినగర్లో, అదే జిల్లాకు చెందిన రామారావు(70) మూసాపేట జనతానగర్లో నివాసముంటున్నారు. వీరి భార్యాపిల్లలు శ్రీకాకుళంలోనే ఉంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో ప్రతిరోజు మద్యం సేవించేవారు.
మద్యం సేవించిన ప్రతిసారి శ్యామ్సుందర్రావు తరుచుగా రామారావును మాటలతో వేధిస్తుండే వాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్యామ్సుందర్రావు మద్యం సేవించిన తరువాత రామారావును దుర్బాషలాడాడు. దీంతో ఆవేశం పట్టలేక రామారావు పక్కనే ఉన్న ఓ సెంట్రింగ్ కర్రతో శ్యామ్సుందర్రావుపై దాడి చేసి పరారయ్యాడు. దీంతో తలకు తీవ్ర గాయాలైన శ్యామ్సుందర్రావు అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న సనత్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రామారావును అదుపులోకి తీసుకున్నారు.