మాదాపూర్, జూలై 3: వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థలో, సాంకేతిక పరివర్తన శక్తిని ఉపయోగించడం, ఆవిష్కరణలలో అగ్రగామిగా నిలవడం ఎంతో కీలకమని కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, డాక్టర్ జి.పార్థ సారథి వర్మ అన్నారు. కొండాపూర్లోని కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అధునాతన ఆప్టిమైజేషన్ విధానంతో డైనమిక్ ఫీల్డ్, విస్తృత శ్రేణి అప్లికేషన్లపై దృష్టి సారించి అడ్వాన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్లు, దాని అప్లికేషన్లపై మూడు రోజుల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐ సాంకేతిక పరివర్తన శక్తితో అధ్యాపకులను మరింత శక్తివంతం చేయవచ్చని అన్నారు.
ఏఐ టెక్నాలజీతో కూడిన అప్లికేషన్లు పరిశ్రమలను విప్లవాత్మకంగా మారుస్తున్నట్లు తెలిపారు. ఆటోమేషన్, డాటా విశ్లేషణ వంటి నిర్ణయం తీసుకోవడం వలన ఉత్పాదకత, సామర్థ్యం మెరుగుపడుతాయన్నారు. ఇలాంటి సెషన్లు జ్ఞాన మార్పిడి, సహకారం కొరకు ప్రత్యేక వేదికను అందిస్తాయన్నారు. ఇందులో పాల్గొనేవారు వారి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడానికి, పరిశోధన, విద్యలో ఏఐ యొక్క ఉపయోగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఏఐ యొక్క ముఖ్య ప్రయోజనం అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లను క్రమబద్ధీకరించడం, బోధన, పరిశోధనలకు ఎక్కువ సమయం, శక్తిని కేటాయించేలా అధ్యాపకులకు వీలు కల్పించడం చేస్తున్నదన్నారు. ఇందులో కేఎల్హెచ్ హైదరాబాద్ ప్రిన్సిపాల్, డాక్టర్ ఏ.రామకృష్ణ, కన్వీనర్, డాక్టర్ అర్పితా గుప్తా, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, అధ్యాపకులు, ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు.