చాదర్ఘాట్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) ఆధ్వర్యంలో 1001 విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్, వాలీబాల్ జాతీయ కోచ్ లు కళ్లెం అమృత్రాజ్, జి.వినోద్ కమార్, కారింగల మారుతీ లకు శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి విత్తన గణపతి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలన్నారు.