చాదర్ఘాట్ : షాదీముబారక్ పథకం పేదింటి మహిళలకు వరం లాంటిదని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. చార్మినార్ తహసీల్ పరిధిలోని 30 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన కార్యాలయంలో షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ రిజ్వాన్, ఎంఐఎం నేతలు తదితరులు పాల్గొన్నారు.