సికింద్రాబాద్, జూన్ 14 : ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సం క్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతుందని, వీటిని సికింద్రాబాద్ పరిధిలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ ని యోజకవర్గం పరిధిలోని కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సీతాఫల్మండిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు.95మందికి రూ.కోటి 25 లక్షల కల్యాణలక్ష్మి, 70 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ, సునీత, తహసీల్దార్ జానకీ తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ చాలెంజ్ను విజయవంతం చేయండి..
అడ్డగుట్ట, జూన్ 14: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. అడ్డగుట్ట డివిజన్ శాంతినగర్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్గౌడ్ జన్మదినం సందర్భంగా పద్మారావును సోమవారం కలిసి, గ్రీన్ చాలెంజ్లో భాగంగా మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రామేశ్వర్గౌడ్, కిరణ్గౌడ్, నగేశ్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.