సికింద్రాబాద్, మే 29: కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ, సందేహం లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సూచించారు. సీతాఫల్మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో కొనసాగుతున్న ప్రత్యేక కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. సమాజానికి పీడలా పట్టిపీడిస్తున్న కరోనా నివారణకు వ్యాక్సినేషన్ సరైన విధానమని అన్నారు. వ్యాక్సిన్ కూపన్లను చూపిస్తే పోలీసులు కూడా పూర్తి సహకారం అందిస్తారని వెల్లడించారు. మరో ఎనిమిది రోజుల పాటు సాగే వ్యాక్సిన్ ప్రక్రియను వినియోగించుకోవాలని పద్మారావు గౌడ్ కోరారు. రామేశ్వర్గౌడ్, సుంకు రాంచందర్, బెజ్జంకి రాజేశ్, పాకసాయి. మల్లేశ్ పాల్గొన్నారు.