రవీంద్రభారతి, సెప్టెంబర్ 26: తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ, సూర్య చంద్ర స్వచ్ఛంద సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మదర్ థెరిస్సా 111వ జయంతిని ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ., కళాసేవా పోషకులు రేగొండ నరేశ్, కళారత్న, లయన్ డాక్టర్ ఎస్పీ భారతి, లయన్ డాక్టర్ చిల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు హాజరై మాట్లాడుతూ.. కరోనా సమయంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సామాజికవేత్తలకు మదర్ థెరిస్సా అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం బాలనృత్యోత్సవ నాట్యనెమలి అవార్డ్స్ -2021ను ప్రదానం చేశారు. అనంతరం బాలికలు చేసిన నృత్యాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, వివిధ రంగాలకు చెందిన కళాకారులు, సామాజికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.