సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇతర రాష్ర్టాల నేరస్తులపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఢిల్లీలో కాల్సెంటర్లు ఏర్పాటు చేసి జాబ్ పోర్టల్స్, ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్మీడియాల్లో ఉద్యోగాల ప్రకటనలు విడుదల చేస్తూ నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న విజయ్ రావల్, ప్రియాంక గాంధీలను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. అయినా వీరి నేర ప్రవృత్తి మారకపోవడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.