సిటీబ్యూరో: హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఖిల భారతీయ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, బతుకమ్మకుంట భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. కోర్టు పరిధిలోని అంశంపై రంగనాథ్ మీడియాతో మాట్లాడటంపై సుధాకర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల 2న రంగనాథ్ ప్రెస్మీట్ పెట్టి అందులో కోర్టులో ఉన్న వివాదం కొనసాగుతున్న భూమిపై వ్యాఖ్యలు చేయడంతో పాటు కోర్టులో సమర్పించిన కొన్ని సాక్ష్యాలను ప్రదర్శించారన్నారు. రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు, పత్రికా సమావేశం అఖిల భారతీయ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ జరిపి రంగనాథ్పై చర్యలు తీసుకోవాలని ఎడ్ల సుధాకర్రెడ్డి సీఎస్ను కోరారు.