ఎల్లారెడ్డిపేట, మే 20: కరోనా మహమ్మారి ధాటికి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో వైరస్ బారినపడి ఒకే రోజు వ్యవధిలో తల్లీకొడుకు మృతిచెందారు. దుమాలకు చెందిన ఉల్లి దేవరాజు(45), అతని తల్లి మల్లవ్వ(65)కు ఆరురోజుల కిందట కరోనా పాజిటివ్ అని తేలింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఇద్దరూ మండలకేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించి బుధవారం దేవరాజు మృతిచెందగా.. తీవ్ర మనోవేదనకు గురైన తల్లి చికిత్సపొందుతూ గురువారం కన్నుమూసింది.
మరో నెలలో పెండ్లనగా..
మరో నెలలో పెండ్లనగా ఓ యువకుడు కరోనాకు బలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ బాకర్పల్లికి చెందిన పబ్బతి సంతోష్రెడ్డి (26) హైదరాబాద్లో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి. నెలరోజుల్లో బంధువుల అమ్మాయితో పెండ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. పదిరోజుల కిందట సంతోష్కు కరోనా పాజిటివ్గా తేలడంతో.. స్వగ్రామంలో హోంఐసొలేషన్లో ఉంటున్నాడు. శ్వాస సమస్య తలెత్తి కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరి చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
ఎన్టీపీసీలో దంపతులు
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన భార్యాభర్తలు కరోనాకు బలయ్యారు. అల్లి మల్లేశ్(63) ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి. ఈ నెల 16న ఆయన భార్య అల్లి లక్ష్మి (57) కరోనాతో మృతిచెందగా.. గురువారం మల్లేశ్ కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.