హైదరాబాద్ : నగరంలోని కృష్ణాగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. క్రికెట్ ఆడుతుండగా.. బౌలింగ్ సరిగా చేయడం లేదంటూ తోటి విద్యార్థులు మన్సూర్పై దాడి చేయగా.. తీవ్ర గాయాలయ్యాయి.
తరగతి గదిలోనే కుప్పకూలడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ఆసుపత్రికి తరలించింది. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.