చిక్కడపల్లి, సెప్టెంబర్ 26: ఇష్టపడి చదివితే సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించడం సులభమని సివిల్స్ టాపర్ శ్రీజ సూచించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని విజన్ ఐఏఎస్ అకాడమి ఆధ్యర్యంలో సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీజ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా చదివితే లక్ష్యం సాధించడం సులభతరమన్నారు. ఈ సందర్భంగా విజన్ ఐఏఎస్ సౌత్ రీజియన్ బ్రాంచ్ హెడ్ ఫణి మాట్లాడుతూ.. ఆలిండియా 20 ర్యాంక్ సాధించిన శ్రీజ తెలుగు రాష్ర్టాల్లో అగ్రస్థానంలో నిలిచారన్నారు. శ్రీజ తమ వద్ద కోచింగ్ తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీజను ఘనంగా సన్మానించారు.