సిటీబ్యూరో, జనవరి 13(నమస్తే తెలంగాణ) /చార్మినార్: తెలంగాణ రాష్ట్ర రాజధానికి కల్పిస్తున్న భద్రతలో కీలక పాత్ర (ఆర్మ్ర్ రిజర్వ్ ఫో ర్స్) సాయుధ బలగాలదేనని, నగరానికి ప్రత్యేక బలం వారేనని నగర పోలీసు కమిషనర్ కొత్తకో ట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేట్ల బుర్జ్లోని సా యుధ దళ విభాగం, శిక్షణ కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు.
అనంతరం, పేట్ల బుర్జ్ పోలీసు మైదానంలో వివిధ విభాగాలకు చెందిన పోలీసు బలగాలు నిర్వహించిన సెర్మోనియల్ పరేడ్ను వీక్షించి, సీపీ వారిని ప్రశంసించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ 1932లో ఆఫ్ఘన్ సిటీ పోలీస్ సాయుధ వ్యవస్థగా పురుడు పోసుకున్న నగర సాయుధ దళాల వ్యవస్థ నేడు అంచెలంచెలుగా రూపాంతరం చెంది, నగరంలో శక్తివంతమైన పోలీసు ఫోర్స్గా మారిందన్నారు.
వీఐపీల భద్రత విషయంలో సీఎస్డ్ల్యూ విభాగం వారు ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా విధులు నిర్వహించాలని, ప్రధాన పండుగలు, వేడుకల్లో ప్రజల భద్రత దృష్ట్యా సరైన విధంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వెల్ఫేర్ విషయంలో మహిళా పోలీసులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, అంతే కాకుండా హో మ్ గార్డ్ ఆఫీసర్స్, ఎస్పీఓలకు కూడా వెల్ఫేర్ విషయంలో వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయిం ట్ సీపీ వి.సత్యనారాయణ, అన్ని విభాగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.