అల్వాల్,మే19ః అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 6 ఏళ్ల చిన్నారి తన్విక అనుమానాస్పద మృతి కేసులో తల్లి రేఖ,ప్రియుడు బోనగిరి సాయికుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం..ఈ నెల 16న రాత్రి ఓల్డ్ అల్వాల్కు చెందిన తన్విక కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.అనంతరం ఇంటి పైభాగంలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్లో చిన్నారి మృతదేహం లభించింది.దీనిపై కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలుః
బేగంపేట్ ఏసీపీ గోపాల్కృష్ణమూర్తి పర్యవేక్షణలో డీఐ వీరబాబు,ఎస్ఐ దేవేందర్ దర్యాప్తు చేపట్టారు.రేఖకు 2020లో దూరపు బంధువు రాజుతో వివాహం జరిగింది.తన్విక జన్మించాక భార్యాభర్తల మధ్య గొడవలతో 2020 నుంచి విడిగా ఉంటున్నారు.మార్చి 4న తన్విక మొదటి పుట్టిన రోజు సందర్భగా ఇంటి పక్కనే ఉండే సాయికుమార్తో రేఖకు పరిచయం ఏర్పాడింది.అది క్రమంగా ప్రేమగా మారి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.సాయికుమార్ (20) ఏళ్లు కావడం రేఖకు అప్పటికే పెళ్లి జరిగి కూతురు ఉండటంతో సాయికుమార్ కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు.
దీంతో తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ బయట కలుసుకునేవారు.వారం కిత్రం శ్రీబేకరీ ఎదురుగా కాలనీలో కలుసుకుని పెళ్లికి చిన్నారి అడ్డుగా ఉందని భావించి ఆమెను తొలగించాలని ప్రణాళిక వేశారు.మొదట అల్వాల్ చెరువులో తోసేయాలనుకున్నా రద్దీ ఎక్కువగా ఉండటం, ఇంటికి దూరం కావడంతో ఆలోచన విరమించుకున్నారు.సాయికుమార్ సలహా సలహా మేరకు ఈనెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిని ఆడుకుందామని టెర్రస్పైకి తీసుకెళ్లి వాటర్ ట్యాంక్లో వేసి హత్య చేసింది.తర్వాత కిందకి వచ్చి పాప కనిపించడం లేదని నాటకమాడింది.ప్రియుడు సాయికుమార్ ఒత్తిడితోనే చిన్నారిని చంపినట్లు రేఖ పోలీసుల విచారణలో ఒప్పుకుంది.ఈ కేసును ఛేదించిన సీఐ ప్రశాంత్, డీఐ వీరాబాబు,ఎస్ఐ దేవేందర్ను అధికారులు అభినందించారు.