సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని సెన్సెస్-2027 సర్వేపై 60 సర్కిల్ల పరిధిలో ఆర్జి క్లర్క్లుగా నియామకమైన జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సెన్సెస్ -2027 సర్వే రెండు దశల్లో జరుగుతుందన్నారు. జనాభా గణన-2027 నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని పక్కాగా జరిగేలా చూడాలని చంద్రకళ అధికారులను ఆదేశించారు.