బన్సీలాల్పేట్, డిసెంబర్ 1 : ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినం సందర్భంగా బుధవారం గాంధీ వైద్య కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫిసర్ డాక్టర్ బి.వేణు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ప్రకాశ్రావు ప్రారంభించిన ఈ ర్యాలీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం, ఓపీ విభాగం, అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం మీదుగా తిరిగి కళాశాల వరకు కొనసాగింది. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సీహెచ్.కోటేశ్వరమ్మ, ఎంపీహెచ్ఈఓ ఎమ్.శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఐఏడీవీఎల్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన శిబిరం నిర్వహించారు. గాంధీ దవాఖానలోని బయటి రోగుల విభాగంలోకి వచ్చిన రోగులకు అవగాహన కల్పించారు. గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ శిబిరంలో ఐడీవీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కటకం భూమేశ్ కుమార్, ఐడీవీఎల్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ డీబీఎన్.మూర్తి, కోశాధికారి డాక్టర్ బి.జనార్దన్, గాంధీ దవాఖాన డీవీఎల్ విభాగం ప్రొఫెసర్లు డాక్టర్ సుధారాణి, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ రఘుపతిరెడ్డి, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీఆర్ హిల్స్ బస్తీ దవాఖాన ఆధ్వర్యంలో..
జూబ్లీహిల్స్,డిసెంబర్1: ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినం సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎస్పీఆర్ హిల్స్ బస్తీ దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేతారెడ్డి ర్యాలీ బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు.