గాజులరామారం, ఏప్రిల్ 14 : జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు వైన్ షాపు ముందు ఎయిర్గన్తో హల్చల్ చేసిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎల్లమ్మబండ మహంకాళీనగర్కు చెందిన దిలీప్పవర్ మంగళవారం రాత్రి 10:30సమయంలో శ్రీలాస్య వైన్స్ సమీపంలోని పాన్ షాపులో సిగరేట్ కొనుగోలు చేసి అక్కడే తన మిత్రుడు జాన్సన్తో మాట్లాడుతున్నాడు.
అదే సమయంలో ఆల్విన్కాలనీకి చెందిన హరీశ్ ఫార్చునర్ కారు(టీఎస్ 08 జీజీ 8556)లో ఎల్లమ్మబండ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తూ.. వైన్స్ వద్ద మద్యం కోసం కారు నిలిపి పోలీస్ సైరన్ మోగించాడు. దీంతో పోలీస్ సైరన్ ఎందుకు వేశావని దిలీప్పవర్ను అడుగగా తాను రాజకీయ నాయకుడి కొడుకునని చెప్పడంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో హరీశ్ కారులోనుంచి గన్ తీసి చంపుతానని బెదిరించగా.. వైన్షాప్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు హరీశ్ను అదుపులోకి తీసుకుని జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. దిలీప్ పవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.