Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణలో తవ్విన కొద్దీ విస్మయపరిచే విషయాలు బయటపడుతున్నాయి. అతడికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. 2014లో వివాహమైన మరో మహిళతో సన్నిహిత సంబంధం నడిపినట్లు ఆధారాలు సుకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గదినుంచి ప్రేమలేఖలను స్వాధీనం చేసుకున్నారు. అశోక్నగర్లోని ఉదయ్ రూమ్లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రెండు ప్రేమలేఖలు, ల్యాప్టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన వివాహితతో అతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు గుర్తించారు.
ఆ మహిళకు 2014లో వివాహమైంది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెతో పరిచయం పెంచుకొని లివ్-ఇన్ రిలేషన్లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా ఇంకా విడాకులు రాలేదని సదరు మహిళ తిరస్కరించింది. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తనతో శిక్షణలో కొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని మరింత దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు