Hyderabad | దుండిగల్, మే 12 : బయో ఇంజినీరింగ్ ఇంటర్న్షిప్ కోసం నగరానికి వచ్చిన ఓ విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్కు చెందిన యువతి (20) చెన్నైలోని ఓ కళాశాలలో బయో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. అదే కళాశాలలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
యువతి బయో ఇంజినీరింగ్ కోర్సు పూర్తి కావడంతో జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో ఇంటర్న్షిప్ సీట్ ఇప్పిస్తానని చెప్పిన అజయ్.. ఈనెల 3న ఆమెను చెన్నై నుంచి నగరానికి రప్పించాడు. నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలోని రూమ్కి తీసుకొచ్చాడు. సదరు యువతితో పాటు అజయ్ అతడి స్నేహితుడు హరితో కలిసి మద్యం(వోడ్కా) తాగారు. అర్థరాత్రి దాటిక యువతిపై మొదట అజయ్.. ఆ తర్వాత హరి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు.