సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే. దీంతో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్ దొరికేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువగా ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. ఇండ్లమీద, బాల్కనీ, గోడలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సెకండ్ వేవ్లో కరోనా విజృంభించి ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు. ఇలా కొవిడ్ నేర్పిన పాఠంతో ఎయిర్ ప్యూరిఫై మొక్కల పెంపకంపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసేందుకు నర్సరీల వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు వినియోగదారుల డిమాండ్కు అనుగుణంగా నర్సరీ నిర్వాహకులు సైతం అనేక మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రూ.50 నుంచి రూ.500ల వరకు అమ్ముతున్నారు.
ఏడాది కాలంగా ఆక్సిజన్ మొక్కలకు డిమాండ్ పెరిగింది. కొవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం 50 శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లుగా కాకుండానే ఇంటి అలంకరణకు ఈ మొక్కలు ఎంతో ప్రసిద్ధి. అదీగాక వీటి సంరక్షణ ఎంతో సులువు. -కె.శ్రీను, తులసీ నర్సరీ, హుమాయున్నగర్