కుత్బుల్లాపూర్,ఫిబ్రవరి10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరు తూ స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 125 గజాల వరకు స్థలం ఉన్న పేదలకు ఉచితంగా 58 జీఓ కింద పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనతో దరఖాస్తులు చేసుకున్నారని, ఇప్పటికి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సూరా రం సర్వే నంబర్ 107, రాజీవ్గాంధీనగర్ సర్వే నంబర్ 79 కోర్టు కేసులో ఉండడం ద్వారా పట్టాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జీఓ 59 కింద అర్హులైన వారికి ఇండ్ల పట్టాలు మంజూరు చేస్తామని, కానీ 10 శాతం కట్టాల్సిన రేటు 2014 కాకుండా ప్రస్తుత డేట్ ప్రకారం మొదటి విడుత కింద చెల్లించాలని అధికారుల నుంచి పేద ప్రజలకు ఒత్తిడి రావడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.గాజులరామారం 329 సర్వే నంబర్, కుత్బుల్లాపూర్ 348/2 నెంబర్, ఇతరత్రా సర్వే నంబర్లలో రెవెన్యూ సమస్యలు నెలకొన్నాయని, గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీలో వక్ఫ్బోర్డు గెజిట్ నోటిఫికేషన్లో సర్వే నంబర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. దీనికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పంది స్తూ రెవెన్యూ సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తామని, సమస్యలను పరిష్కరించేలా తగు