సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : సైబరాబాద్ పోలీసులు వివిధ కారణాలతో స్వాధీనం చేసుకున్న వాహనాలలో క్లెయిమ్ చేయని 820 వాహనాలు మెహినాబాద్ పీఎస్ గ్రౌండ్లో ఉన్నాయని, వాటిని బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించామని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఆ వాహనాల వివరాలు www.cyberabadpolice. gov.in వెబ్సైట్లో పొందుపరిచామని, వేలానికి అభ్యంతరం చెప్పే వాళ్లు తమ వద్ద ఉన్న వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లతో ఆరు నెలల్లోపు సంబంధిత ఎస్హెచ్ఓను సంప్రదించాలని సీపీ సూచించారు.