కాప్రా, మే 8 : జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పరిధిలో అభివృద్ధి పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. రాను న్న వర్షాకాలంలో నాలాలు నిండుకొని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నాలాలు, డ్రైన్ల డీసిల్టింగ్/ పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సర్కిల్ పరిధిలోని కాప్రా, ఏఎస్రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచా రం తదితర డివిజన్లలో 20.67కి.మీ మేర ఉన్న నాలాల్లో మాన్యువల్గా, మెషినరీ (యంత్రాల)ద్వారా పూడిక తీసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి, పనులు చేపడుతున్నారు. ఈ డీసిల్టింగ్ పనులు 19 రోజు ల క్రితం ప్రారంభమైనట్లు సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిలాల్ వెల్లడించారు. అన్ని డివిజన్లలో పనులు ము మ్మరంగా కొనసాగుతున్నాయని వివరించారు. గతంలో కలిగిన ఇబ్బందులు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నాలాల్లో పూడికతీత పనులను వర్షాకాలం కంటే ముందుగానే చేపట్టడం జరిగిందని ఈఈ తెలిపారు. మొత్తం రూ.1.01 కోట్లతో అన్ని డ్రైన్లు,కచ్ఛా నాలాల పూడికతీ త పనులను మాన్యువల్గా, మెషినరీ (యాంత్రిక) విభాగాలుగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రీమాన్సూన్, పోస్ట్ మాన్సూన్ పనులుగా ఇవి కొనసాగుతాయని తెలిపారు.
కొనసాగుతున్న పనులు..
కాప్రా డివిజన్లో కాప్రాచెరువు సమీపంలోని కేసీఆర్ బస్తీ నాలా నుంచి సాకేత్ అవుట్లెట్ వరకు ఉన్న 2,400 మీటర్ల నాలా పూడికతీత పనులు కొనసాగుతున్నాయని ఆ డివిజన్ ఏఈఈ అభిషేక్ తెలిపారు. అలాగే.. ఏఎస్ రావునగర్, చర్లపల్లి, హెచ్బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్లలో కూడా నాలా పూడికతీత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వర్షాకాలం ఆరంభం అయ్యేలోగా అన్ని నాలాలు, స్టార్మ్ వాటర్ డ్రైన్లు, కచ్ఛానాలాల్లో పూడికతీసి సిద్ధం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
డివిజన్ల వారీగా..
కాప్రా డివిజన్లో 2,297 మీటర్లు మాన్యువల్గా, 2,420 మీటర్లు యాంత్రికంగా.. మొత్తం 4,717 మీట ర్లు, ఏఎస్రావునగర్లో 1,992 మాన్యువల్గా, 1,070 మీటర్లు యాంత్రికంగా, మొత్తం 2,162 మీటర్లు, చర్లపల్లిలో 3,293 మీటర్లు మాన్యువల్గా, 4,100 మీటర్లు యాంత్రికంగా మొత్తం 7,393 మీటర్లు డీసిల్టింగ్ పనులు చేపట్టనున్నారు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్లో 1,399 మీటర్లు మాన్యువల్గా మాత్రమే పూడికతీ త పనులు చేపడుతారు. మల్లాపూర్, నాచారం డివిజన్లలో 2,381 మీటర్లు మాన్యువల్గా, 1,725 మీటర్లు యం త్రాల ద్వారా నాలాల పూడికతీత పనులు చేపట్టనున్నా రు. సర్కిల్ పరిధిలో ఉన్న మొత్తం 11,362 మీటర్ల నాలాలను మాన్యువల్గా, 9,315 మీటర్ల నాలాలను యాంత్రికంగా పూడికతీసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి పనులు ప్రారంభించారు. సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 787.50 మీటర్లు మాన్యువల్గా, 490 మీటర్లు హిటాచీ, జేసీబీ, ఇతర యంత్రాల ద్వారా నాలాల పూడికతీతపనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
నిరంతరాయంగా పూడికతీత పనులు..
కాప్రా సర్కిల్ పరిధిలో ఈ ఏడాది రూ.1.01 కోట్ల తో చేపట్టిన నాలాల పూడికతీత పనులు ప్రస్తుతం ము మ్మరంగా కొనసాగుతున్నా యి. అన్ని డివిజన్లలోని నాలాల్లో పూడికతీత పనులు మాన్యువల్గా, మెషినరీ (యంత్రాల)ద్వారా జరుగు తాయి. వర్షాలు రాకముందే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ముందస్తుగా పూడికతీత పను లు చేపట్టాం. ప్రీమాన్సూన్, పోస్ట్మాన్సూన్ పనులుగా ఇవి నిరంతరాయంగా కొనసాగుతాయి.
–హరిలాల్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, కాప్రా సర్కిల్