చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కోవిల్పట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్రా కజగం (ఏఎంఎంకే) పార్టీ 50 మంది అభ్యర్థులతో రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. ఆ పార్టీ తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. మాజీ ఎమ్మెల్యేలు పి పళనియప్పన్, ఎం రెంగసామి, జి సెంటమిజాన్, సి షణ్ముగవేలు, ఎన్జీ పార్థిబాన్ పేర్లు ఇందులో ఉన్నాయి. గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో దినకరన్తోపాటు మరో 49 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
శశికళ బంధువైన టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే వ్యతిరేకంగా ఏఎంఎంకే పార్టీని ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 6న జరుగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎంతోపాటు సోషల్ డెమక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ)తో పొత్తుపెట్టుకున్నారు. ఏఐఎంఐఎంకు మూడు స్థానాలు, ఎస్డీపీఐకి ఆరు సీట్లు కేటాయించారు. మరోవైపు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం)తో పొత్తుకు ఎస్డీఐపీ ప్రయత్నిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.