శరీరానికి నీటి అవసరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు చల్లని వాతావరణం ఉంటున్నది. ఇక ముందు చల్లదనం ఇంకా పెరుగుతుంది. కాబట్టి వర్కవుట్స్ చేసేముందు తాగే నీళ్లు కాస్త తగ్గించాలి. సాధారణంగా ఉదయాన్నే రెండు గ్లాసుల నీళ్లు తాగాలి. నిమ్మరసం, తేనె కలుపుకొని తాగాలనే నియమాలు పాటించేవాళ్లు ఎప్పడూ ఒక కొలమానం పెట్టుకుని తాగుతుంటారు. జీర్ణవ్యవస్థలో ఒత్తిడి పెంచడం ద్వారా విరేచనం సాఫీగా వచ్చేందుకు ప్రయత్నించేవాళ్లు కూడా ఎక్కువగా నీళ్లు తాగుతారు.
ఈ అలవాట్లు ఉంటే వ్యాయామం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరం కోల్పోయే నీరు తక్కువగా ఉంటుంది. ఆ నీరు జీర్ణాశయం, మూత్రాశయం చేరినప్పుడు వర్కవుట్స్ చేస్తే అసౌకర్యంగా ఉంటుంది. సరిగా చేయలేరు. వాతావరణం ఏ రోజు చల్లగా ఉంటే ఆ రోజు నీళ్లు తక్కువగా తాగాలనే నియమం తప్పక పాటించాలి. ఎండ ఉంటే ఎక్కువ నీళ్లు తాగాలి. కాబట్టి నీళ్లు తాగిన తర్వాత కాస్త ఆలస్యంగా వర్కవుట్స్ మొదలుపెట్టాలి. నీటి యాజమాన్యం మొక్కల పెంపకానికే కాదు శరీరా ఆరోగ్యానికీ అవసరమే!