భారత్కు స్వాతంత్య్రం వచ్చేనాటికే అమెరికా అణుబాంబులను తయారు చేసి ప్రయోగించింది.
– పీ-5 దేశాల్లో (అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్)
అమెరికానే మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది.
– న్యూక్లియర్ అణుబాంబును మొదటిసారి రెండో ప్రపంచ యుద్ధం చివరి దశకంలో అమెరికా జపాన్పై ప్రయోగించింది. 1945 ఆగస్టు 6న అమెరికా సైనిక దళాలు యురేనియం గన్ ఫిజన్ బాంబు లిటిల్బాయ్ అనే పేరుతో హిరోషిమాపై ప్రయోగించారు.
– మూడు రోజుల తర్వాత అమెరికా రెండోసారి కూడా జపాన్పై మరో న్యూక్లియర్ బాంబును ప్రయోగించింది. ఆగస్టు 9న అమెరికా వైమానిక దళం ప్లుటోనియం ఇన్ఫ్లోజన్ టైప్ ఫిజన్ బాంబు ఫాట్మన్ అనే పేరుతో నాగసాకిపై ప్రయోగించింది.
– రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల ఆలోచనా సరళిలో మార్పు వచ్చింది. అమెరికా న్యూక్లియర్ శక్తిని చూసిన తర్వాత తాము అలాంటి శక్తిని రూపొందించుకోవాలనే దిశగా తయారు చేసుకున్నాయి. చైనా కూడా న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. దీంతో ఇవి పవర్ఫుల్ ఐదు (పీ-5) దేశాలుగా మారాయి.
– జవహర్లాల్ నెహ్రూ, చైనాతో పంచశీల ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇందులో బౌద్ధమత సూత్రాలను పేర్కొన్నారు. కానీ, ఈ దౌత్య సంబంధం విజయం సాధించలేకపోయింది.
– ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా చైనా 1962లో భారతదేశంపై యుద్ధం ప్రకటించింది. న్యూక్లియర్ విజ్ఞానాన్ని విధ్వంసం సృష్టించడానికి గాక ప్రజాప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని నెహ్రూ నిర్ణయించుకున్నారు.
– భావితరాలకు నెహ్రూ ఆదర్శవాది అనడానికి ఆయన 1954లో శ్రీలంక రాజధాని కొలంబోలో చేసిన ప్రసంగం నిదర్శనం. ఇతని విధానం భారత్ ఎల్లప్పుడూ శాంతికాముక దేశంగా నిలుస్తుందనడానికి ఉదాహరణ.
– హోమీ జహంగీర్ బాబాను భారతదేశ అణుసిద్ధాంత రూపశిల్పిగా పేర్కొంటారు.
– 1944లో హోమీ బాబా ప్రత్యేక అణుపరిశోధనా సంస్థను టాటా ట్రస్ట్ సహాయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీని ఫలితంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ను స్థాపించారు.
– స్వాతంత్య్రానంతరం 1948లో అటామిక్ ఎనర్జీ యాక్ట్ను ఆమోదించారు. ఈ చట్టం ఫలితంగా ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పడింది.
– 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే ప్రత్యేక డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు.
– హోమీ జహంగీర్ బాబా మరణానంతరం 1967, జనవరి 22న టీఐఎఫ్ఆర్ను బార్క్ (బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్)గా మార్పు చేశారు.
– న్యూక్లియర్ పోగ్రాం నియంత్రణ, సంరక్షణా చర్యల కోసం అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డును స్థాపించారు.
– భారత మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సర (సామర్థ్యం 1 మెగావాట్)ను బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేశారు.
– కెనడా న్యూక్లియర్ రియాక్టర్ను సరఫరా చేసింది. ఈ రియాక్టర్కు కావాల్సిన భారజలాన్ని అమెరికా ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ ద్వారా భారత్కు సమకూర్చింది.
– కెనడా, అమెరికా సహకారంతో ఏర్పాటు చేసిన న్యూక్లియర్ రియాక్టర్- సైరస్.
– 1960లో స్వదేశీ పరిజ్ఞానంతో ధ్రువ అనే న్యూక్లియర్ను అభివృద్ధి చేశారు.
– భారతదేశం పీటీబీటీ (పాక్షిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం)ని ఆమోదించింది. ఈ ఒప్పందం అంగీకరించిన దేశాలు అణ్వాయుధ ప్రయోగాలను అంతరిక్షంలో గాని, జలగర్భంలో గాని నిర్వహించరాదు.
– లాల్ బహదూర్శాస్త్రి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1964 అక్టోబర్ 16న చైనా అణుపరీక్ష నిర్వహించింది. 1964 నవంబర్లో పార్లమెంట్లో దేశ పురోభివృద్ధికి అణుశక్తిని వాడేందుకు ప్రభుత్వం నిశ్చయించిందని ప్రకటించారు.
– 1965లో ట్రాంబేలో ప్లుటోనియం శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేశారు. శాస్త్రి పరిపాలన కాలంలోనే భారతదేశం, పాకిస్థాన్ నుంచి యుద్ధ ఎదుర్కోవాల్సి వచ్చింది.
– 1965లో పాకిస్థాన్ భారత్పై యుద్ధం చేయడం అనేది భారత్ అణ్వాయుధాలను నిర్మించుకోవాలనే ఒత్తిడికి కారణమైంది. కానీ, లాల్బహదూర్ శాస్త్రి ఒత్తిడులను అధిగమించారే కాని అణుపరిజ్ఞానాన్ని ఆయుధ శక్తిగా మార్చడానికి అంగీకరించలేదు.
– 1967లో చైనా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది.
– ఇందిరాగాంధీ పరిపాలనా కాలంలో 1971లో పాకిస్థాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధ సమయంలో అమెరికా పాకిస్థాన్ వైపు మొగ్గు చూపింది.
– ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించినా భవిష్యత్తులో అమెరికా వంటి అణ్వస్త్ర దేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను తయారు చేయాల్సిన ఆవశ్యకతలను గుర్తించింది.
– మొదటిసారిగా ఇందిరాగాంధీ భారత్లో అణ్వాయుధాలను తయారు చేయడానికి సారథ్యం వహించింది.
– 1974, మే 18న పోఖ్రాన్ బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో రాజస్థాన్లో మొదటిసారి సైనికుల పర్యవేక్షణలో అణుపరీక్షలు నిర్వహించారు. దీంతో భారత్లో అణ్వాయుధ శకం ప్రారంభమైందని చెప్పవచ్చు.
– ఈ ప్రయోగంతో ఐక్యరాజ్యసమితిలో పీ-5 దేశాలు కాకుండా మిగిలిన దేశాల్లో మొదటిసారి అణుబాంబు ప్రయోగం నిర్వహించిన దేశంగా భారత్ నిలిచింది.
– 1968లో అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయాల్సిందిగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను కోరింది.
– ఏ దేశం ఇక ముందు అణ్వాయుధాలను తయారు చేయరాదనే ప్రధానంశంతో కూడిన ఈ ఒప్పందం వివక్షత కలిగిందిగా భావించి భారతదేశం సంతకం చేయలేదు.
– మొత్తం 191 దేశాలు ఇందులో చేరాయి. ఉత్తరకొరియా 1985లో ఎన్టీపీలో చేరింది. కానీ, 2003లో ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.
మొరార్జీ దేశాయ్ కాలం
– 1978లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భవిష్యత్తులో శాంతియుత ప్రయోజనాలకు కూడా భారత్ అణుపరీక్షలు నిర్వహించదని పేర్కొన్నారు.
– పాకిస్థాన్ అణ్వాయుధాలు తయారుచేస్తే భారత్ కూడా తన అణువిధానాన్ని పునఃసమీక్షిస్తుందని ప్రకంటించారు.
– దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. అణు విద్యుత్ కర్మాగారాల అభివృద్ధికి, భారత్ అణువిద్యుత్ సంస్థను ఏర్పాటు చేశారు.
– అణ్వాయుధాల నుంచి ప్రపంచాన్ని విముక్తి చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే అణువిధానం ఉండాలి. దీనికి అగ్రరాజ్యాలు చొరవ చూపాలని ప్రకటించారు.
– ఎన్పీటీపై సంతకం చేయడానికి నిరాకరించారు.
– 1998 భారత అణ్వస్త్ర శకంలో ఒక గొప్ప మైలురాయి. ఈ ఏడాదిలో ప్రధానంగా మూడు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
1. పోఖ్రాన్-2 ప్రయోగం
2. భారత అణువిధాన ప్రకటన (న్యూక్లియర్ డాక్ట్రిన్)
3. సీటీబీటీ ఒప్పందం
– 1998, మే నెలలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్-2ను భారత్ ప్రయోగించింది. ఈ ప్రయోగంలో భాగంగా ఐదు అణుబాంబులను రూపొందించారు.
– పోఖ్రాన్-2 ప్రయోగంతో భారతదేశాన్ని సంపూర్ణ అణ్వాయుధ దేశంగా ప్రకటించారు.
– 1998లో భారతదేశ ప్రధానమంత్రిగా వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు సీటీబీటీ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది.
అమెరికా 1945
(మొదటి అణుబాంబు ట్రినిటీ)
సోవియట్ యూనియన్ 1949
బ్రిటన్ 1952
ఫ్రాన్స్ 1960
చైనా 1964