రంగల్ అర్బన్ : ఒకటి, రెండు చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మేం ఎక్కడా ఎవరిపై దాడి చేయలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండ హరిత హోటల్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎవరు దాడి చేసినా తప్పు.
బీజేపీ వాళ్లు చిన్న గొడవ చేసే ప్రయత్నం చేశారు.
ఎన్నికలు, పోలింగ్ అన్నాక కాస్త ఉత్కంఠ ఉంటుంది. ఎవ్వరినీ తప్పు పట్టలేమన్నారు.
పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని సూచించారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు సహనంతో ఉన్నారు.
పెరిగిన ఓటింగ్ శాతం మాకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామని మంత్రి తెలిపారు.
చారిత్రాత్మకంగా ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పోలింగ్ను సక్సెస్ చేసిన అందరికి మంత్రి మరోసారి కృజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఈ సారి రెండు చోట్ల అధికంగా ఓటింగ్ నమోదు అయిందన్నారు.