అల వైకుంఠపురంలో సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ మీదుంది అందాల సుందరి పూజాహెగ్డే. దక్షిణాదిలో బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది పూజాహెగ్డే. ఈ భామ ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాతోపాటు విజయ్-నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో భాగస్వామ్యం అయింది. అదేవిధంగా మెగా ప్రాజెక్టు ఆచార్యలో కీ రోల్ చేస్తోంది. హిందీలో పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. ఈ భామ ప్రస్తుతం రెమ్యునరేషన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.
విజయ్ సినిమా కోసం పూజాహెగ్డే భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నాయి. తాజా గాసిప్ ప్రకారం రూ.2.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. అల వైకుంఠపురంలో చిత్రం నుంచి ఇప్పటివరకు పూజాహెగ్డే సుమారు రూ.1000 కోట్ల సినీ మార్కెట్ లో భాగస్వామ్యమైంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.