‘కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)’లో 2,48,550 మంది, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో 41,362 మంది ఉద్యోగుల వేతన భత్యాలు నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (ఎన్.సీడబ్ల్యూఏ) ప్రకారంగా చెల్లించుతారు. అయిదు జాతీయ సంఘాలు ఏఐటీయూసీ, సీఐటీయు, హెచ్ఎంఎస్, బీఎంఎస్ (ఐఎన్టీయుసీ అంతర్గత వివాదాల వల్ల పాల్గొనటంలేదు),బొగ్గు కంపెనీల ప్రతినిధులు కలిసి జాయింట్ బైపార్టీయేట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ’(జేబీసీసీఐ)గా చర్చలు జరుపుతారు.1974 డిసెంబర్ 11న ఒప్పందం అయిన మొదటి ఎన్సీడబ్ల్యూఏ లో కనీస వేతనం రూ.274లు 1975 జనవరి నుంచి 1978 డిసెంబర్ వరకు చెల్లించారు. 2021 జూన్ 30 నాటికి 10వ,ఎన్సీడబ్ల్యూఏ కాలపరిమితి ముగిసింది. 2021 జూలై నుంచి 11వ ఎన్సీడబ్ల్యూఏ అమలు లోకి రావాలి. ఇందుకు ఏడు సార్లు జరిగిన జేబీసీసీఐ చర్చలు ఫలప్రదం కాలేదు.
నవంబర్ 29న జరిగిన చర్చలలో సీఐఎల్ ప్రతినిధులు ‘మినిమమ్ గ్యారెంటీ బెనిఫిట్’ (ఎంజీబీ)గా 10 శాతం వేతన చెల్లింపు ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. మినహాయింపు లు లేకుండా వేతన ఒప్పందం జరిగితే ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్)’ ప్రశ్నలు లేవనెత్తుతుందని, అలాగే ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ)’ మార్గదర్శకాల కంటే 10శాతం కనీస హామీ ప్రయోజనం ఎక్కువని స్పష్టం చేశారు.
3వ లోక్సభ (1962-67) అంచనాల కమిటీ కేంద్రీకృత సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల పనితీరును నిరంతరం అంచనా వేయడానికి ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ 1965 లో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (బీపీఈ)ని ఏర్పాటు చేసింది. తదనంతరం 19 85 సెప్టెంబర్లో మంత్రిత్వశాఖ విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీపీఈ పరిశ్రమల మంత్రిత్వశాఖలో భాగం చేశారు. ఆ తర్వాత 19 90 మే లో ‘బీపీఈ’, ‘డీపీఈ’గా మారి కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలో భాగమైంది.అప్పటి నుం చి పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (సీపీఎస్ఈ) లకు నోడల్ శాఖగా వ్యవహరిస్తున్నది. సీపీఎస్ఈ ల పనితీరు, మెరుగుదల, మూల్యాంకనం, స్వయంప్రతిపత్తి, సిబ్బంది నిర్వహణ అలాగే వివిధ అంశాలపై సర్వే రూపకంగా సమాచారాన్ని సేకరించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నది.
కేంద్రం ప్రభుత్వ బొగ్గు పరిశ్రమలైన కోల్ ఇండియా, సింగరేణి కంపెనీలకు బడ్జెట్ సపోర్ట్ను 2014 నుంచి కేటాయించడం లేదు. కనీసం బొగ్గుబ్లాక్ల కేటాయింపులో ప్రాముఖ్యం ఇవ్వ డం లేదు. పన్నుల చెల్లింపులో రాయితీలూ ఇవ్వ డం లేదు. అయిన ఏటేటా బొగ్గు ఉత్పత్తులను పెంచుతూ దేశాభివృద్ధికి తోడ్పడుచున్నవి. బొగ్గు గని కార్మికులు తల్లి కడుపులాంటి బొగ్గు బావుల్లో సచ్చి బతికినట్లుగా ప్రమాదాలతో సహవాసం చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఉపసంహరణ, వాణిజ్య బొగ్గు గనులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బొగ్గు గనుల వేలం ప్రక్రియలతో కోల్ఇండియా, సింగరేణి భవిష్యత్తుకు ముప్పు తెస్తున్నది. వేతన చెల్లింపులో కోత పెట్టడానికి పూనుకుంటున్నది. ఉద్యోగుల వేతన ఒప్పందానికి ‘డీపీఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ఎంటర్ప్రైజెస్)’,‘కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాల పేరుతో వేతన ఒప్పందంలో ఆటంకాలు కల్పిస్తున్నది.
అదే సమయంలో ప్రైవేటు రంగానికి, బ్రహుళజాతి సంస్థలకు కార్పొరేటు పన్ను తగ్గింపు వల్ల ఏటా దాదాపు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. ఇంకా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ/ ప్రోడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ) ద్వారా 5 శాతం నుంచి 3శాతం ఆర్థిక ప్రయోజనాన్ని కల్పిస్తున్నది. 2020 జాన్ 18న ప్రధాని నరేంద్రమోదీ కమర్షియల్ మైనింగ్ ప్రాతిపదికన 44 బొగ్గు బ్లాక్లకు వేలం పాటను ప్రారంభించాడు. వేలం పాటలో బొగ్గు బ్లాక్ లను దక్కించుకున్న వారికి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.50,000 కోట్లు కేటాయించుతామని ప్రకటించాడు. ఆరవ విడత 141 బొగ్గు బ్లాక్ ల వేలం పాటలో బొగ్గుబ్లాక్లు దక్కించుకున్న వారి కి కోల్ గ్యాసిఫికేషన్ కోసం రూ.6,000 కోట్లు కేటాయించుతామని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఈ ప్రభుత్వ సంస్కరణల వలన పెట్టుబడిదారులు మాత్రమే మిక్కిలి ప్రయోజనాన్ని పొందుతున్నారు.
బొగ్గుగని కార్మికుల 10వ, ఎన్సీడబ్ల్యూఏ 2016 జూలై 1న అమలులోకి వచ్చినప్పుడు కనీస వేతనం రూ.26,289.12 గా నిర్ణయమైంది. వేతన ఒప్పందం కాలపరిమితి అయిదు సంవత్సరాలు 2021జూన్ నాటికి ముగిసింది. జూలై నుంచి 11వ, ఎన్సీడబ్ల్యూఏ అమలులోకి వస్తుం ది. కనీస వేతనంచెల్లింపు ప్రకారంగా మూల వేతనం రూ.26, 289.12 పై స్థిర కరువు భత్యం (ఎస్డీఏ) 1.795 శాతం రూ. 471.09 పై, మారేడు కరువు భత్యం (వీడీఏ) 27.8 శాతంగా రూ.7,309.38 పై, అటెండెం ట్ బోనస్ 10 శాతం, రూ.2,629.12 పై మొత్తం రూ.36,699.52 పై యూనియన్స్ 50 శాతం మినిమమ్ గ్యారంటీ బెనిఫిట్ (ఎంజీబీ)గా డిమాండ్ చేశాయి.కాని ఏడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం 30 శాతం ‘ఎంజీబీ’ఇచ్చినా సమ్మతమే అన్నారు. కానీ యాజమాన్య ప్రతినిధులు కేవలం 10 శాతం మాత్రమే మినిమమ్ గ్యారంటీ బెనిఫిట్గా చెల్లించుతామని మొండికేశారు. దానితో యూనియన్స్ ఐక్య కార్యాచరణ ఉద్యమానికి సన్నద్ధమైనవి. డిసెంబర్ 9 న దేశ వ్యాప్తంగా బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేశారు. డిసెంబర్ 20న జార్ఖండ్లోని రాంచిలో జాతీయ సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటించనున్నాయి. అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుంటే దేశ వ్యాప్తంగా సమ్మె చేయడానికి కూడా సిద్ధం అవుతామని తెలిపారు. కాబట్టి కోల్బెల్ట్ రాష్ర్టాల ప్రజా ప్రతినిధులు కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి బొగ్గు గని కార్మికుల ‘నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్-11’ ఒప్పందానికి తోడ్పడాలని కార్మికులు కోరుకుంటున్నారు.
(వ్యాసకర్త: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్/ ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి)
కోల్ ఇండియా 2021-2022 లో 622.23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రూ.17,378.42 కోట్ల లాభాలను సాధించింది. కేంద్రానికి ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సైజ్, క్లీన్ ఎనర్జీ సెస్, సెంట్రల్ సేల్స్ టాక్స్, సర్వీస్టాక్స్ యితర పన్నులపేర 2020-2021లో రూ.34, 396.39 కోట్లు, 2021-2022లో రూ.37,056.69 కోట్లు చెల్లించింది. సీఐఎల్ గనులున్న రాష్ర్టాలకు రాయల్టీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ,సేల్స్ టాక్స్ వ్యాట్, ఎంట్రీ టాక్స్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, మోడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ (ఎంఏడీఏ),ఇతర పన్నుల పేర 2020-2021లో రూ.55,917.03 కోట్లు, 2021- 2022లో రూ.57, 497. 87 కోట్లు చెల్లించింది.
మేరుగు రాజయ్య: 94414 40791