తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిదేండ్లు పూర్తిచేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. తెలంగాణ దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రం. అయినా కూడా… ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమష్టి కృషితో నేడు తెలంగాణ అన్నిరంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. దేశానికే రోల్ మాడల్గా తెలంగాణ మారింది.
పదేండ్లు కూడా నిండని తెలంగాణ నేడు సుపరిపాలన విధానాలతో దేశమే తనగురించి మాట్లాడుకునే అంశంగా మారింది. ఇంత స్వల్పకాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోనూ జరిగి ఉంటే, ఐదు ట్రిలియన్ డాలర్ల కల ఏండ్ల కిందటే నెరవేరేది. ప్రజలే కేంద్ర బిందువుగా తెలంగాణలో సుపరిపాలన సాగుతున్నది.
రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే ప్రజలకు మే లైన పరిపాలన అందుతున్నదని కేంద్రం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలతో స్పష్టం చేసింది. కేంద్ర పరిపాలనా సం స్కరణలు, పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ 2020-21ఏడాదికి రాష్ర్టాలకు గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను ప్రకటించింది.తెలంగాణ రెండు అంశాల్లో మొదటిస్థానంలో నిలువగా, మరో రెండు అంశాల్లో రెండోస్థానంలో నిలిచింది. తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు బాగా పురోగతి సాధించాయని నివేదికలో వెల్లడించారు. పరిశ్రమలు, వాణిజ్య రంగం, సాంఘిక సంక్షే మం, అభివృద్ధి అంశంల్లోనూ తొలి ర్యాంకును సాధించింది. ఆర్థిక నిర్వహణ, ప్రజామౌలిక సదుపాయాల్లో రెండో ర్యాంకు ను సాధించింది.
ఈడీవోడీ, పరిశ్రమల వృద్ధి, ఎంఎస్ఎంఈల ఏర్పాటు, స్టార్టప్లు, జీఎస్టీ కింద సంస్థ లు రిజిస్టర్ కావడం ఆధారంగా ఈ క్యాటగిరీ లో ర్యాంకులిచ్చారు. 0.699 స్కోర్తో తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. టీఎస్ఐపాస్ చట్టం ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు రావ డంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభ్యమయ్యాయి. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన పరిపాలన, శాంతిభద్ర తలు, భూమి లభ్యత, నీరు, విద్యుత్, మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో పారిశ్రామికవేత్తలు మన దగ్గరకు తరలివస్తున్నారు. గూగుల్, అమెజాన్ లాంటి ప్రపంచస్థాయి కంపె నీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి.
ఎకానమిక్ గవర్నెన్స్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రం సొంత పన్నుల రాబడుల్లో గతంలో కంటే ఎంతో వృద్ధిని సాధి ంచిందని నివేదికలో వెల్లడించారు. ఇతర ఆర్థిక అంశాల్లో తెలంగాణ క్రమశిక్షణతో వ్యవహరించడంతో రెండో స్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమం, ఆరోగ్యబీమా, గ్రామీణ ఉపాధి రంగాల్లో మెరుగుదలతో తెలంగాణ ముందు నిలిచింది. ప్రతి ఒక్కరికి ఇల్లు, ఆర్థికాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం విషయాల్లో ప్రగతి సాధించి దేశంలోనే తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ 0.413 స్కోరు సాధించింది.
మహారాష్ట్ర (67.51), తెలంగాణ (64. 13), తమిళనాడు (61.09) మొత్తం రాబడులకు సొంత పన్ను రాబడిలో అసాధారణ వృద్ధి ని నమోదు చేశాయి. ఈ రంగంలో తెలంగా ణ, గుజరాత్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్ ర్యాంకింగ్లో రాష్ట్రం ఆరవ స్థానంలో, వ్యవసాయం-అనుబంధ రంగాల ర్యాంకింగ్లో ఏడవ స్థానంలో నిలిచింది.
పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యుటిలిటీస్; ఆర్థిక పాలన; సాంఘిక సంక్షేమం అభివృద్ధి ఇండెక్స్ ప్రకారం, 2021లో 20 రాష్ర్టాలు తమ కాంపోజిట్ GGI స్కోర్లను మెరుగుపరిచాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 99 శాతం సాధించిన రాష్ట్రం, పరిశ్రమలో 8.78 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. సాంఘిక సంక్షేమం అభివృద్ధి వంటి క్లిష్టమైన రంగాలలో అభివృద్ధి నమూనాకు కీలకమైనటువంటి, పౌరులు ప్రత్యక్ష లబ్ధిదారులైన పారామితులను కొలిచే రాష్ర్టాలలో 0.617 పాయింట్లతో తెలంగాణ అగ్రస్థానం లో ఉన్నది.
డాక్టర్ జీ రంజిత్రెడ్డి
(వ్యాసకర్త: చేవెళ్ల ఎంపీ)