సమాజం ఉత్పత్తి చేసే, వినియోగించే ఆర్థిక వస్తువులు, సేవల పరిమాణం, నాణ్యతలో పెరుగుదల దేశ ఆర్థిక వృద్ధిని వివరిస్తాయి. వృద్ధిని తరచూ గృహ ఆదాయంలో పెరుగుదల లేదా జీడీపీ పెరుగుదలగా కొలుస్తారు. అయితే ఇది సమగ్ర విధానం కాదు. దేశంలోని ఆర్థిక అసమానతలను అర్థం చేసుకోవడానికి ఆదాయం ఒక మార్గం. కాబట్టి ఒక దేశాభివృద్ధిని వివరించడానికి సామాన్యుల జీవితాల్లో వచ్చిన మార్పు పరిమాణాన్ని మాత్రమే కాకుండా, నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక పునరుద్ధరణ నత్తనడకన సాగింది. 1991లో ప్రధానిగా ఉన్న పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశ ఆర్థికవ్యవస్థ గాడినపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా భారత్ ఒకటి దాదాపు 36 శాతం మంది యువతది 20 ఏండ్ల వయస్సు కంటే తక్కువే. దాదాపు 63 శాతం మంది 15-59 ఏండ్ల వారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర కీలకం. 2012లో 1.7 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ రాబోయే రెండేండ్లలో 3 ట్రిలియన్ డాలర్లను చేరడం ద్వారా భారత్ సూపర్ పవర్గా మారగలదనిపిస్తున్నది. 2020లో కరోనా కారణంగా ఏడాదికిపైగా వృద్ధి కాకపోగా, 2021లో అది 9 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఏ అభివృద్ధి చెందుతున్న దేశానికైనా ముఖ్యమైన సూచిక ద్రవ్యోల్బణం. దశాబ్దం కిందట సుమారు 9 శాతం ఉంది, ఇప్పుడు కరోనా అడ్డంకులు సృష్టించినా 6 శాతం వద్ద స్థిరపడుతున్నది.
తెలంగాణ సహకారం: రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశాభివృద్ధిలో తెలంగాణ దారిదీపంగా నిలిచింది. ప్రతి రాష్ట్రం ఇలాగే సహకరిస్తే కొన్నేండ్లలో దేశం సూపర్ పవర్ హోదాకు చేరడం ఖాయమని ఆర్థికవేత్తల అభిప్రాయం. జాతీయ జీడీపీలో తెలంగాణ 5 శాతం సహకారం అందిస్తున్నది. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 26 బేసిస్ పాయింట్లు పెరిగి 2020-21లో 5 శాతానికి చేరుకున్నది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో 93.8 శాతం పెరిగింది. ఇదే కాలంలో దేశ పెరుగుదల 58.4 శాతం. దేశ జీడీపీకి సుమారు 5 శాతం దోహదపడింది, ఇది ఒక శాతం పెరిగింది. దేశ జనాభాలో 3 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి లెక్కలోకి తీసుకోవాలి. 2014-15 నుంచి 2020-21 వరకు ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ జీఎస్డీపీ 11.7 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సాధించింది. భారత్ సగటు వార్షిక వృద్ధి రేటు 8.1 శాతంతో ఉన్నది.
తలసరి ఆదాయం (పీసీఐ) అనేది జనాభా శ్రేయస్సుకు బలమైన ఆర్థిక సూచికలలో ఒకటి. తెలంగాణ (రూ.2,37,632) జాతీయ పీసీఐ (రూ.1,28,829) కంటే 1.84 రెట్లు. 2014-15 తర్వాత, దక్షిణాది రాష్ర్టాల్లో తలసరి ఆదాయంలో తెలంగాణ అత్యధిక సగటు వృద్ధి 11.5 శాతం సాధించింది. హైదరాబాద్ దేశానికి ఒక ముఖ్యమైన ఐటీ డెస్టినేషన్, హబ్. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 78 వేల కోట్లు కాగా, తాజాగా దాదాపు రెట్టింపు 1.45 లక్షల కోట్లకు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. ఇది రాష్ట్ర ఆదాయ నిర్మాణానికి తోడ్పడటమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామందికి ఉపాధిని కల్పించింది.
రాష్ర్టాల రెవెన్యూ రాబడులు సొంత వనరుల నుంచి, కేంద్ర బదిలీల నుంచి వస్తాయి. 2015-21 కాలంలో రాష్ర్టాలకు సగటున 54 శాతం రెవె న్యూ రాబడులు సొంత వనరుల నుంచి, 46 శా తం కేంద్ర బదిలీల నుంచి వచ్చాయి. కాగా తెలంగాణ సొంత పన్ను ఆదాయం 75 శాతం. కేంద్ర బదిలీలు 25 శాతమే. జాతీయ సగటు 46 శాతంతో పోలిస్తే ఇది అత్యల్పం. రాష్ర్టాలు తమ బడ్జెట్లో సగటున 6.4 శాతం వ్యవసాయంపై వెచ్చించగా, తెలంగాణ 11.3 శాతం ఖర్చుచేసింది. వ్యవసాయం, నీటిపారుదల, పట్టణ, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, ఇంధనం, రోడ్లు, వం తెనల నిర్మాణం కోసం ప్రధానంగా ఖర్చు ఉంటుం ది. 2015-16 నుంచి 2020-21 మధ్య రాష్ర్టా లు సగటున ఈ రంగాలపై తమ బడ్జెట్లో 31 శాతం ఖర్చుచేశాయి. కానీ, తెలంగాణ 38 శాతం ఖర్చుతో దేశంలో మూడవ స్థానంలో నిలిచింది.ఇంధనరంగం కింద ఖర్చులో వినియోగదారులకు సబ్సిడీ, పవర్ ప్రాజెక్టులకు కేటాయింపు, ఉదయ్ పథకం కింద డిస్కమ్లకు సహాయం ఉంటాయి. రాష్ర్టాలు సగటున తమ బడ్జెట్లో 5.7 శాతం ఇంధనరంగానికి ఖర్చుచేశాయి. తెలంగాణ 7.3 శాతం ఖర్చుచేసింది. 2014లో విపరీతమైన విద్యుత్ కొరతను ఎదుర్కొన్న తెలంగాణ ఇప్పుడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారింది.
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దేశాభివృద్ధిలో తెలంగాణ దారిదీపంగా నిలిచింది. ప్రతి రాష్ట్రం ఇలాగే సహకరిస్తే కొన్నేండ్లలో దేశం సూపర్ పవర్ హోదాకు చేరడం ఖాయమని ఆర్థికవేత్తల అభిప్రాయం. జాతీయ జీడీపీలో తెలంగాణ 5 శాతం సహకారం అందిస్తున్నది.
సామాజిక భద్రతపై, రాష్ర్టాలు సగటున బడ్జెట్లో 4.1 శాతం ఖర్చుచేశాయి. తెలంగాణ మా త్రం అత్యధికంగా 6.9 శాతం ఖర్చుచేసింది. నీటిపారుదల రంగంలో రాష్ర్టాలు సగటున తమ బడ్జెట్లో 4 శాతం ఖర్చుచేశాయి. కానీ తెలంగాణ అత్యధికంగా 8.4 శాతం ఖర్చుచేసింది. 1.45 కోట్ల ఎకరాల భూమికి నీటినందిస్తూనే నీటిపారుదల, చెరువుల వ్యవస్థను విస్తృతం చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇతర రాష్ర్టాలు సగటున 2.9 శాతం ఖర్చుచేస్తే, తెలంగాణ 6.9 శాతం ఖర్చుచేసింది. రాష్ట్రం సం క్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తూనే, పటిష్ఠమైన ఆదాయ ఉత్పాదక యంత్రాంగాన్ని అమల్లోకి తెచ్చింది. ఇతర రాష్ర్టాలు స్ఫూర్తి పొందే స్థాయిలో నిలకడగా పనిచేస్తున్నది. కేంద్ర, రాష్ర్టాలు మనది సమాఖ్య వ్యవస్థ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా పనిచేయాలి. అదేవిధంగా కేం ద్రం పెద్ద మనసుతో సహకరించాలి. ఇది దేశానికే కాదు, ప్రతి వ్యక్తి శ్రేయస్సుకు దోహదపడుతుంది.