సోషల్ మీడియాలో బ్రతికి ఉన్న వాళ్లనే చంపేస్తూ అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నారు. మొన్నటికి మొన్న మీనాక్షి శేషాద్రి చనిపోయిందంటూ ప్రచారం చేసారు. ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ అలీ కన్నుమూసాడంటూ పుకార్లు పుట్టించారు. ఇక రీసెంట్గా బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా కరోనాతో చనిపోయారంటూ వార్తలు ప్రచారం చేసారు. శక్తిమాన్ సీరియల్తో దేశవ్యాప్తంగా ఈయన ఫేమస్ అయిన ఈ నటుడు మరణ వార్త విని అంతా షాక్ అయ్యారు. అయితే తాను బతికే ఉన్నానంటూ వీడియో ద్వారా వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇప్పుడు ప్రముఖు నటుడు పరేష్ రావల్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆయన కన్నుమూశారని వార్తలు చక్కర్లుకొట్టాయి. ఈ వార్త పరేష్ రావల్ చెంతకు చేరడంతో ఆయన పాజిటివ్గా స్పందించారు. నేను ఉదయం 7 గంటలకు నిద్రపోతున్నాను.అపార్థం చేసుకున్నందుకు క్షమించాలి అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. పరేష్ తెలుగులో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో లింగం మామ పాత్ర పోషించి అలరించిన విషయం తెలిసిందే.