అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా…లేదా ఏపీ ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా? లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా….లేక లోకేశ్ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబును భయపెడుతోందా?!’ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై పార్టీ సీనియర్ నేతల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు మండిపడుతున్నారు.