మన్సూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర-2022 క్యాలెండర్ను మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి మాట్లాడుతూ క్షౌర వృత్తిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం పాటపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గడల రాజు, మల్లెపల్లి నర్సింలు, ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, గ్రేటర్ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.