TTD News | తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ 50 సైకిళ్లకు విరాళంగా అందించింది. టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన సైకిళ్ళను అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో సైకిళ్లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి దాత అందజేశారు. ఈ కార్యక్రంలో టీటీడీ బోర్డు సభ్యులు సౌరబ్, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్ రెడ్డి, వీఓ బాల్ రెడ్డి, మురుగన్ సంస్థ ప్రతినిధులు ప్రభాకర్ బాబు, శ్రీమతి భారతి, అభిషేక్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్జీఎస్ కళాశాలకు న్యాక్ ‘ఏ’ గ్రేడ్
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ గోవింద రాజ స్వామి జూనియర్ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఇటీవల కళాశాలను సందర్శించిన న్యాక్ కమిటీ ఈ మేరకు పత్రాలను టీటీడీకి పంపింది. బుధవారం రాత్రి తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ఏవీ ధర్మారెడ్డి ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి, కళాశాల అధ్యాపకులను చైర్మన్ అభినందించారు. డీఈఓ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ గోవింద రాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.