‘మానవజన్మకు లక్ష్యం ఏమిటి? మనం ఎందుకు జన్మించాం? ఈ జన్మలోనే పరమాత్మను ఎలా చేరుకోగలం?’ ఈ ప్రశ్నలకు ‘భగవద్గీత’ చక్కని సమాధానాలను ఇచ్చింది. జీవితాన్ని సన్మార్గంలో అంటే, పరమాత్మ చూపిన బాటలో సాగించేవారికి ఆయనే మెల్లమెల్లగా వెలుగునిస్తాడు. ఇది అందరికీ ఒక్క జన్మలో సాధ్యం కావాలని లేదు. నారదాది మునిముఖ్యులు కూడా ఆయన మాయలో చిక్కుకున్నవారే. మనవంటి సాధారణ మానవులెంత!
బుద్ధిః జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ॥
-లంక శివరామకృష్ణశాస్త్రి