Suicide | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో శుక్రవారం దుర్ఘటన చోటు చేసుకున్నది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ రెడ్డి.. విజయవాడలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడలోని పవిత్ర అపార్ట్మెంట్లో మంజునాథ రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఆయన కుటుంబ సభ్యులు, స్థానికులు మణిపాల్ దవాఖానకు తరలించే లోపే మంజునాథ రెడ్డి మరణించాడని పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా మంజునాథ రెడ్డి కుటుంబంలో తగాదాలు కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.