న్యూఢిల్లీ : గురుగ్రాంలో దారుణం వెలుగుచూసింది. 24 ఏండ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడి పెండ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేశాడు. ఏడాది కిందట జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది. తనపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అతడి బంధువులు ఈ విషయం ఫిర్యాదు చేస్తే తన అభ్యంతరకర వీడియోలు వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనేసర్లో నిందితుడు ఆనంద్తో యువతికి పరిచయం కాగా అప్పటి నుంచి వీరు రోజూ కలుస్తుండే వారు. తాను ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని యువతి చెప్పడంతో నిందితుడు సాయం చేస్తానంటూ గురుగ్రాంలోని అక్క, బావ ఇంటికి ఆమెను తీసుకువెళ్లాడు. అక్కడ యువతి బర్త్డేను వారు సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలో మత్తు మందు కలిపిన పానీయం ఇవ్వడంతో యువతి స్ప్రహ కోల్పోయింది. ఆపై నిందితుడు ఆనంద్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా మౌనం దాల్చింది. గత ఏడాది జులైలో నిందితుడు ఆనంద్ అక్క బావలు ఆనంద్ను పెండ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో కుంగుబాటుకు లోనైన బాధితురాలు ధైర్యం కూడదీసుకుని ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.