శేరిలింగంపల్లి : కాలభైరవ పూజతో ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ చేయిస్తానంటు ఓ ఎంబీబీఎస్ గాడ్యుయేట్ను బురిడీ కొట్టంచిన నకిలీబాబాపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలి ఇన్స్ఫెక్టర్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం…పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసుకొని 2011లో నగరానికి వలసవచ్చి కొండాపూర్లో నివాసం ఉంటుంది.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన గాడ్యుయేట్లు మనదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్ఎంజీఈ) పాస్ అవ్వాలి. ఈ క్రమంలో పలుమార్లు ఎఫ్ఎంజీఈ పరీక్షలు రాసిన సదరు మహిళ పాస్ కాలేకపోయింది. పేస్బుక్లో ప్రకటనలు చూసిన సదరు మహిళ సోదరి ఓ స్వామిజీ పూజలు చేసి పరీక్షలు పాస్ చేయిస్తాడంటు చేసిన ప్రకటనలు చూపించింది.
దీంతో 2020 లో సదరు ప్రకటనలు చూసిన మహిళ పశ్చిమ బెంగాల్కు చెందిన విశ్వజిత్ అనే నకిలీబాబాను పేస్బుక్ ద్వారా ఆశ్రయించింది. తన ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ చేయించాలని విశ్వజిత్ను కోరింది. ఆ నకిలీబాబాకు కాలభైరవ పూజ పేరిట 2021 జూలై వరకు విడతల వారిగా దాదాపు రూః 80,000 చెల్లించింది. అ తర్వాత సదరు విశ్వజిత్ బాబా నుంచి స్పందన లేకపోవడం, అతని ఫోన్ స్విచ్చాప్లో ఉండడంతో తాను మోసపోయానని గ్రహించి గచ్చిబౌలి పోలీసులను గత జూలైలో అశ్రయించింది.
బాదితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు నకిలీబాబా విశ్వజిత్ను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. పశ్చిమబెంగాల్కు ప్రత్యేక బృందాన్ని పోలీసులు పంపించి దర్యాప్తు వేగవంతం చేశారు.