ములుగు : పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాతరను ములుగు పోలీసలు నిర్వీర్యం చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఓఎస్డీ శోభన్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్తో కలిసి జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో మీడియాకు వివరాలను వెల్లడించారు.
జిల్లాలోని ఏటూరునాగారం మండలం దొడ్ల ఏరియా అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు భారీ ఎత్తున అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారన్నారు. మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు.