రంగారెడ్డి : వెంచర్ అనుమతి కోసం రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ మన్నెగూడ సర్పంచ్ నవీన్గౌడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ కథనం మేరకు..జిల్లాలోని పూడూర్ మండలం మన్నెగూడ గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ ఓ వెంచర్ అనుమతి కోసం రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రాజేంద్రనగర్లోని షాదాన్ కళాశాల వద్ద రూ.13 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నామని వివరాలను వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.