అబ్దుల్లాపూర్మెట్ : కళాశాలకని ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన విరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీకి చెందిన కేతవత్ లచ్చు నాలుగో కుమార్తె కేతవత్ రజిత ఈ నెల 17న సర్టీఫికెట్లు తెచ్చుకుంటానని కళాశాలకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికిన ఆచూకీ లభించకపోవడంతో తండ్రి లచ్చు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.