చెన్నై: కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు నవ దంపతులను మహిళ తండ్రి నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తమిళనాడులోని తుత్తుకుడి జిల్లాలో ఈ దారుణం జరిగింది. టుటికోరిన్ ప్రాంతానికి చెందిన మాణిక్రాజ్, రేష్మ ఒకే కులానికి చెందినవారు. బంధుత్వం ఉన్న వీరిద్దరూ ప్రేమించుకున్నారు. యువతి కాలేజీలో చదువుతుండగా, యువకుడు చదువును మధ్యలోనే ఆపేశాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి పెళ్లికి మహిళ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
కాగా, మాణిక్రాజ్, రేష్మ ఇంటి నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. తాము మేజర్లమని, ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు మధురై పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పారు. అలాగే పోలీసుల సమక్షంలోనే మహిళ కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడారు. అనంతరం అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు.
అయితే ఆ ఇంటికి వెళ్లిన యువతి తండ్రి ఆ నవ జంటను నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ జంట పోలీస్ రక్షణ కోరలేదని, అందుకే సెక్యూరిటీ కల్పించలేదని పోలీసులు తెలిపారు.