లక్నో: కదులుతున్న కారులో ఒక యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఈ ఘటన జరిగింది. 21 ఏండ్ల యువతికి హర్యానాకు చెందిన తేజ్వీర్తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. నమ్మకం కలగడంతో మంగళవారం ఆగ్రాలో ఎస్ఐ పరీక్ష రాసేందుకు అతడితో కలిసి కారులో వెళ్లింది. అయితే, తిరుగు ప్రయాణంలో తేజ్వీర్ స్నేహితుడు దిగంబర్ కారును డ్రైవ్ చేస్తుండగా తేజ్వీర్ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మధురలోని కోసి కలాన్ ప్రాంతం శివార్లలో ఆమెను వదిలి వెళ్లిపోయాడు.
ఇంటికి చేరిన బాధిత యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రధాన నిందితుడు తేజ్వీర్ను గురువారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు దిగంబర్ అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
22-25 ఏండ్ల వయసున్న ఇద్దరు నిందితులు హర్యానా పల్వాల్లోని మన్పూర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.