సికింద్రాబాద్: గాంధీ దవాఖానలో పేషేంటుకు సహకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు దవాఖాన సిబ్బంది ఒకరు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు చిలకలగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్కు చెందిన ఒక వ్యక్తి (45) కిడ్ని పేషెంట్. అదే గ్రామానికి చెందిన గాంధీ దవాఖాన ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్రావు సహకారంతో ఈనెల 4న గాంధీ దవాఖానలో చేర్చారు.
పేషేంట్తో పాటు అతని భార్య (40) మరదలు (38), వారి అక్కకుమారుడు తోడుగా వచ్చారు. పేషేంట్ను ఈనెల 5న మరో వార్డుకు తరలించడంతో మహిళలు ఇద్దరు అడ్రస్ దొరకకపోవడంతో తికమక పడ్డారు. పెషెంట్ను చూపిస్తానని చెప్పిన ఉమమహేశ్వర్రావు తమను ఓ గదికి తీసుకువెళ్లి బందించి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 11న పెషెంట్ తనభార్య, మరదలు కనిపించకపోవడంతో గాంధీ దవాఖానలో డిశ్చార్జీ కాకుండానే గ్రామానికి వెళ్లిపోయాడు. తరువాత మరదలు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.
అక్క కనిపించడం లేదని తెలుపడంతో వారి అక్కకుమారుడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్రావులు గాంధీ దవాఖాన వద్ద వెతకగా ఆమె విజిటర్స్ విభాగం వద్ద కనిపించింది. ఊరికి వెళ్లి ఈనెల15న భర్తతో పాటు భార్య,మరదలు మహబుబ్నగర్ 1టౌన్లో ఫిర్యాదు చేయగా వారు చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. కాగా సోమవారం చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులను బరోసాకు పంపినట్లు, వారిద్వారా పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు.