తిరువనంతపురం: ఒక యువతి వ్యాయామం చేస్తూ అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందపడి మరణించింది. కేరళలోని కోచిలో గురువారం ఈ ఘటన జరిగింది. కోచి నగరంలోని చిత్తూర్ రోడ్డులో ఉన్న ఒక బహుళ అంతస్తు భవనంలో 18 ఏండ్ల యువతి తన కుటుంబంతో నివసిస్తున్నది. గురువారం ఉదయం తన ఫ్లాట్లోని బాల్కానీ వద్ద సోదరుడు, పొరుగింటి యువతితో కలిసి వ్యాయామం చేస్తుండగా జారి అదుపుతప్పి బిల్డింగ్ పైనుంచి కింద పడింది. ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువతి సోదరుడు, పొరుగింటి యువతి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.