లక్నో: పోలీస్ ఎస్కార్ట్తో జైలు నుంచి వచ్చి కోర్టులో విచారణకు హాజరైన ఓ ఖైదీ తెలివిగా పోలీసులను బురిడీ కొట్టించి పారిపోయాడు ( Inmate escaped ). చేతికి సంకెళ్లు ఉన్నా పోలీసులకు దొరకకుండా పారిపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జాలౌన్ జిల్లాలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జాలౌన్ జిల్లా జైల్లో ఉన్న ఐదుగురు ఖైదీలను ఇవాళ విచారణ నిమిత్తం కల్పిలోని జూనియర్ డివిజన్ సివిల్ మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చారు. ఓ ఇన్స్పెక్టర్, ఐదుగురు కానిస్టేబుళ్లు పోలీస్ వాహనంలో వాళ్లను కోర్టుకు తీసుకొచ్చారు.
కోర్టు విచారణ ముగిసిన అనంతరం ఖైదీలందరినీ మళ్లీ పోలీస్ వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా ఓ ఖైదీ తనకు మూత్రం వస్తుందని చెప్పడంతో ఓ కానిస్టేబుల్ను వెంట పంపించారు. కొంతదూరం వెళ్లాక కానిస్టేబుల్కు ఝర్క్ ఇచ్చిన ఖైదీ అతను తేరుకునేలోపే చేతికి సంకెళ్లతోనే పారిపోయాడు. దాంతో పోలీసులు మరికొన్ని బృందాలను రప్పించి ఖైదీ కోసం ఆ ప్రాంతాన్ని అణువణువు గాలిస్తున్నారు.