రంగారెడ్డి జిల్లా కోర్టులు : డబ్బులు ఇవ్వాలని బెదిరించి కత్తితో దాడి చేసిన నిందితుడు ముబారక్ బిన్ అబ్దుల్లా బిన్ సల్మాన్ సిగర్కు హత్యయత్నం కింద అయిదు సంవత్సరాల జైలు శిక్ష, అయిదు వందల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫనికుమార్ కథనం ప్రకారం..
బాలాపూర్ మండలం షాహిన్నగర్కు చెందిన షేక్ అబ్ధుల్లా బవజీర్ కేబుల్ వ్యాపారం చేస్తుండేవాడు. స్థానికంగా ఉన్న విద్యుత్ స్తంబాలకు రూటర్స్ అమర్చి వినియోగదారులకు కనెక్షన్లు ఇచ్చేవాడు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు రూటర్నుండి కనెక్షన్లను తీసివేస్తుండటంతో డిసెంబర్ 24, 2020 రోజున నిఘావేసి పరిశీలించగా షాహిన్నగర్ వద్ద నిందితుడు ముబారక్ బిన్ అబ్దుల్లా బిన్ సల్మాన్ సిగర్ అనుమానస్పదంగా కనిపించడంతో బాధితుడు ప్రశ్నించాడు.
దీంతో నిందితుడు కత్తి తీసి డబ్బులివ్వాలని బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దీంతో జరిగిన ఘటనపై బాధితుడు షేక్ అబ్ధుల్లా బవజీర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టుచేసి కోర్టులో అభియోగపత్రాన్ని ధాఖలు చేశారు.
కేసులో సాక్షాధారాలను పరీశీలించిన న్యాయస్థానం నిందితునికి అయిదు సంవత్సారాల జైలు శిక్ష, అయిదు వందల జరిమానా విదిస్తూ తీర్పునిచ్చింది.